ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతి




 శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు.మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం.


ఉత్తర కాశ్మీర్‌లోని సోపూర్‌లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.అయితే, దాడి వెనుక పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post