మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

 




కరీంనగర్ జిల్లా అల్గునూరు మానకొండూర్ నియోజకవర్గ స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీడియా అనేది ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని అన్నారు అదేవిదంగా జర్నలిస్ట్ లు ఎంతో కష్టనష్టాలు ఎదుర్కొంటు మానకొండూర్   నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు ఏకతాటిపైకి వచ్చి క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదని అన్నారు నియోజకవర్గ ప్రజలకు ఇంత మంచి అవకాశన్ని కల్పించిన జర్నలిస్ట్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా కరోనా కాలంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా దేశ,రాష్ట్ర ప్రజలకు    ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తూ కరోనా అరికట్టడంలో తమవంతు పాత్ర పోషించారని జర్నలిస్ట్ లకు  అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సల్ల శారదా రవీందర్, సిఐలు మహేష్ గౌడ్,సంతోష్ కుమార్,టీఎంజీవోస్ జిల్లా అధ్యకులు మారం జగదీశ్వర్, యూనిట్ అధ్యక్షులు మామిడి రమేష్ అతిథిలుగా హాజరైయ్యారు

0/Post a Comment/Comments

Previous Post Next Post