మానకొండూరు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా నాగెల్లి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నిక

 


కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా నాగెల్లి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో యూనియన్ సమావేశం నిర్వహించారు  ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బొట్టు శ్రీనివాస్,ఎలుక రాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష్య , ప్రధాన కార్యదర్శి లకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మరెడ్డి,రామగిరి విష్ణుమూర్తి, యూనియన్ సభ్యులు కోరెపు అనిల్, తూముల శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post