టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్.. రాష్ట్రంలో తొలి కేసు



టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్.. రాష్ట్రంలో తొలి కేసు...కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు...  పేద, ధనిక తేడాలేదు.. కూలి, ఉద్యోగి అని భేదం లేదు.. సాధారణ పౌరుడు అయినా.. బడా నేత అయినా.. ఇలా ఎవ్వరిని వదలడం లేదు.. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా సోకింది.. ఇవాళ ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తోంది. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి.. కరోనా లక్షణాలతో హైదరాబాద్ లో  క్వారంటైన్ లో వున్నారు.. ఆయనకి టెస్ట్ చేయగా.. పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు చెబుతున్నారు.. ఇక, తెలంగాణలో కరోనా బారిన పడిన మొదటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకి పాజిటివ్ గా తేలని సంగతి తెలిసిందే.
Previous Post Next Post