అటెండర్ కూడా ఇలా కూర్చొని మాట్లాడడేమో ! ... కాని ఈ కలెక్టర్ గ్రేట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కు వచ్చి ఓ గిరిజన వృద్ధురాలు మెట్లపై కూర్చుంది..అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధుల్లోకి వస్తున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజిం ఆ వృద్ధురాలిని చూసి, ఆమె కూర్చున్న మెట్లపైనే ఆమె పక్కన కూర్చుని పెద్దమ్మా ఏం కావాలి.. ఎటొచ్చారని అడిగారు.. ఆయన కలెక్టర్ అని కూడా తెలియని ఆ వృద్ధురాలు సామాన్యుడితో మాట్లాడినట్లే ‘రెండేండ్ల సంది పింఛన్ వస్త లేదు బిడ్డా… సారును కలుత్తమని వచ్చినా’ అన్నది….. ఎంతో ఆప్యాయంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్… వెంటనే ఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా..శభాష్ కలెక్టర్ అంటూ అభినందించారు..

0/Post a Comment/Comments

Previous Post Next Post