మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ కి (కెవిపిఎస్) అభినందనలు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ వి.వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇవ్వడం జరిగిందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు నర్సింగరావు గారు తెలియజేశారు .. అనంతరం కెవిపిఎస్ నూతన సంవత్సర 2020 డైరీని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. కెవిపిఎస్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బాలు , జిల్లా నాయకురాలు వైష్ణవి , అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం . వినోద , జిల్లా సహాయ కార్యదర్శి సఫియా సుల్తానా , ప్రజానాట్యమండలి (పిఎన్ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది

0/Post a Comment/Comments

Previous Post Next Post