పెళ్ళి మండపం లో వరుడిని కాల్చి చంపిన దుండగులు

అంబరాన్నంటేలా పెళ్లి వేడుక చేయాలనుకున్నారు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.. ముహూర్తం దగ్గరపడుతోందని హడావుడిగా వరుడు, వధువు తరఫు బంధువులు పెళ్లి మండపానికి వచ్చారు. ఇంతలో ఊహించని ఘటన.. పెళ్లి మండపం వద్దే వరుడిపై దుండగులు తుపాకీతో గురి చూసి కాల్చారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని మసీర్‌పూర్‌ బజార్‌లో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వరుడే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వరుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post