మైలారం మల్లికార్జున స్వామి సేవలో కొనగాల మహేష్

మైలారం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలను, పాడిపంటలను చల్లగా కాపాడాలని మొక్కిన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థాపకులు, మాజీ సర్పంచ్ పురంశెట్టి బాలయ్య, ఆలయ చైర్మన్ పర్శరాములు, మండల నాయకులు రవీందర్ రెడ్డి, మాంతాంగి అనిల్, మైసంపెళ్లి మల్లేశం,మున్నూరు కాపు యువత గౌరవ అధ్యక్షులు పురం శెట్టి రమేష్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు వాసు గౌడ్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post