చిగురుమామిడి తహశీల్దార్ రవీందర్ కు సన్మానం...

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న డిండిగాల రవీందర్ ను నవ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు 26న జిల్లా కలెక్టర్ శశాంక చేతుల మీదుగా ఉత్తమ తహశీల్దార్ గా అవార్డ్ తీసుకున్న సందర్భంగా సన్మనించడం జరిగింది తహశీల్దార్ గా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగులో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ, రైతులకు సత్వరం న్యాయం చేస్తూ, కార్యాలయానికే ఒక్క క్రొత్త శోభను తీసుకొచ్చి మండల ప్రజలలో చెరగని ముద్ర వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షుడు పఠేమ్ రమేష్, వంతడుపుల దిలిప్ కుమార్, చాట్ల సమ్మయ్య, గొంటి క్రాంతి కుమార్, కయ్యం వీరయ్య, కుంట గోపాల్, నామ్ సంతోష్, మెడబోయిన తిరుపతి, మెడబోయిన గంగరాజు, సదానందం, సింగిరెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post