మెట్రో సేవలకు మరోసారి అంతరాయం

. తాజాగా మెట్రో సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. శనివారం మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాగుట్ట దగ్గర ఆ ట్రైన్‌ను దాదాపు 27 నిమిషాల పాటు ఆపేశారు.… 27 నిమిషాల తర్వాత ఆ ట్రైన్‌ను లూప్‌లైన్‌లో పెట్టి… మిగతా రైళ్లు వెళ్లేందుకు వీలు కల్పించారు. దాంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరినట్లైంది.

చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం సహజమే. మెట్రో రైళ్లే లేకపోతే… హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యలు మరింత పెరిగేవే. ఇప్పటికే మెట్రో రైళ్లు రోజూ దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నా… రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఆ రైళ్లే లేకపోతే… రోడ్లపై నరకమే కనిపించేది. మెట్రో రైళ్లు, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, MGBS, అమీర్ పేట, హైటెక్ సిటీ, మియాపూర్ వంటి కీలక ప్రాంతాల్ని కలుపుతూ పోతుండటంతో… ఎంతో మంది అవి సౌలభ్యంగా మారాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post