భారతీయులకు శుభవార్త .. మొదటి త్రైమాసికంలో 5జి టెస్టింగ్ ..

.ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద మొబైల్ సర్వీస్ మార్కెట్‌గా ఉంది. దీంతో ఈ 5జీ స్పెక్ట్రం అనుమతుల ప్రక్రియ ఆపరేటర్లకు ఎంతో కీలకం కానుంది.5జీ టెక్నాలజీ సేవలు భారత్‌లో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఈ 5జీ టెక్నాలజీతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో డేటా వేగం మరింత పెరిగనుంది. అంతేకాదు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సహా సాకేంతికత ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అయితే ఈ 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొలుత హువావేకు అనుమతివ్వాలనుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఆపరేటర్లందరికీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇది కేవలం స్పెక్ట్రం ట్రయల్ టెస్ట్‌లకు ఇస్తున్న అనుమతి మాత్రమేనన్నారు. దీనికి సంబంధించిన పర్మిషన్ల ప్రక్రియను టెలికాం విభాగం (డీవోటీ) నిర్వహించనుంది. డీవోటీ అనుమతి తర్వాత.. ఆపరేటర్లు వారి ఇష్టప్రకారం స్పెక్ట్రం సర్వీసులను అందించే నోకియా, హువావే, ఎరిక్సన్‌లలో ఎవరితోనైనా భాగస్వామ్యంగా ఏర్పడవచ్చని తెలిపారు

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post