గన్నేరువరం మండలకేంద్రంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా



 భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీ!య శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు  బిజెపి గన్నేరువరం మండల అధ్యక్షులు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది..


ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు శ్రీ సుగుణకర్ రావు మరియు మనకొండూర్ నియోజకవర్గ ఇంచార్జి గడ్డం నాగరాజు ముఖ్య అతిథిగా, హాజరై శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది... అనంతరం హరితహారం మొక్కలు నాటి కేక్ కట్ చేసి ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది...మరియు వారాసంత ను పరిశీలించడం జరిగింది. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యులు, గొప్ప విద్యావేత్త, మహోన్నత దేశభక్తుడు, దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా, ఆ మహానీయుడికి శతకోటి వందనాలు.అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు మచ్చ బాలరాజు మండల ప్రధాన కార్యదర్శులు జాలి శ్రీనివాస్ రెడ్డి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సామ రాజిరెడ్డి, బోయిని మల్లయ్య, బండి తిరుపతి,మునిగంటి సత్తయ్య, చిగురు సంజీవ్, దొంతరవేని పరశురాములు, బుర్ర సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్ రెడ్డి,  వెంకన్న, బిజెపి మండల మీడియా కన్వీనర్ కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post