ఆంధ్రా అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్



 ఆంధ్రప్రదేశ్  నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి గరిమళ్ల వెంకటకృష్ణారావు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి కరోనా పేషెంట్లతో వస్తున్న అంబులెన్సులను ఆపేస్తున్నారంటే నాలుగు రోజలు క్రితం కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై తక్షణమే స్పందించిన హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్రంలోకి అనుమతించాని ఆదేశించింది. తమ ఆదేశాలను ఆచరించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఇంత జరిగినా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణకు వచ్చే అన్ని రహదారుల్లో అంబులెన్సులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో అంబులెన్సులు, వాహనాలు సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి. వాస్తవానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అనుమతించారు. అయితే, నిన్న రాత్రి  తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడంతో... పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ పోలీసులు అంబులెన్సులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


0/Post a Comment/Comments

Previous Post Next Post