నిన్న దేశంలో క‌రోనాతో 4,329 మంది మృతి ....మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,52,28,996



 భారత దేశం లో  రోజువారీ క‌రోనా కేసుల‌ సంఖ్య త‌గ్గుతోంది. నిన్న‌ కొత్త‌గా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న  4,22,436 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,52,28,996కు చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో  4,329  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,78,719కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,15,96,512  మంది కోలుకున్నారు. 33,53,765 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,44,53,149 మందికి వ్యాక్సిన్లు వేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post