సింపుల్ గా వచ్చాడు.. టీ..తాగి వెళ్లాడు

 


ఆయన ఒక ఎంపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. కాని రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న టీ కొట్టుకు చాలా సింపుల్ గా వచ్చాడు.. టీ ఆర్డిరిచ్చాడు.. తాగి వెళ్లాడు.. ఎటువంటి హంగూ లేదు.. ఆర్భాటం అసలే లేదు.. కాన్వాయ్ కనిపించనే లేదు.. దటీజ్ బండి సంజయ్ కుమార్..

నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా దారిలోని ఓ టీ కొట్టుకు ఒక సామాన్యుడిలా వచ్చిన బండి సంజయ్ కుమార్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అని చెప్పకనే చెప్పారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, నాయకులు సంగప్ప తదితరులు కూడా బండి సజయ్ వెంట ఉన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post