కాల్పులు కలకలం

 


హైదరాబాద్ : కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా, ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Post a Comment

Previous Post Next Post