గన్నేరువరం మండలంలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ - భయాందోళనలో మండల ప్రజలు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం నెలకొంది ఇప్పటివరకు పట్టణాల్లో సమీప మండలాల్లో కేసులు నమోదు చూశాం గన్నేరువరం మండలంలో తొలిసారి కేసులు నమోదు కావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు మండలంలోని హన్మజీపల్లె లో టిఆర్ఎస్ నాయకునికి, అలాగే గుండ్లపల్లి యువకునికి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు వీరికి హోం క్వారంటైన్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం జ్వరం దగ్గు తో పాటు ఒంటి నొప్పులతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది గుండ్లపల్లి కి చెందిన యువకుడు హైదరాబాద్లోని ఒక చిట్ ఫండ్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు గత పది రోజుల క్రితం గ్రామానికి వచ్చినట్లు సమాచారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన
Previous Post Next Post