రైతు ధర్నా - రెండు గంటల సేపు ఆగిన వాహనాలు


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె గ్రామ శివారు లోని బిక్కు వాగు దగ్గర అదే గ్రామానికి చెందిన హరికాంతం అనిల్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ బావి పక్కన మానేరు వాగు ఉంది అయితే అక్రమంగా కొన్ని ఇసుక ట్రాక్టర్లు, మరికొన్ని వే బిల్ పర్మిషన్ తీసుకున్న ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు ఇదే క్రమంలో హరికాంతం అనిల్ రెడ్డి బావి పక్కనే ఇసుకను తీస్తుండగా తండ్రి కొడుకు అడ్డుకున్నాడు ఇదే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు దాదాపు 50 మందికి పైగా అనిల్ రెడ్డి వీరి తండ్రి పైకి వచ్చి చంపుతామని బెదిరించినట్లు రైతు తెలిపాడు దీంతో ఆగ్రహించిన రైతు గన్నేరువరం కరీంనగర్ వెళ్లే రోడ్డు పై తన సొంత కారు తో తండ్రి కొడుకుల తో రెండు గంటల సేపు ధర్నా చేపట్టారు విషయం తెలుసుకున్న గన్నేరువరం టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకొని బావి పక్కన తీయకుండా దూరంగా తీస్తామని హామీ ఇవ్వడంతో అనిల్ రెడ్డి వీరి తండ్రి ధర్నాను ఆపేశారు దీంతో రెండు గంటల సేపు ఉత్కంఠగా వాహనాలు నిలిచిపోయాయి

ఇంత జరిగినా అధికారులు మరియు పోలీసులు  రాకపోవడం గమనార్హం ?


0/Post a Comment/Comments

Previous Post Next Post