గన్నేరువరంలో ఈత - ఖర్జూర మొక్కలు నాటిన జడ్పిటిసి - ఎక్సైజ్ శాఖ సిఐ



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల  కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారు లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ సీఐ ఇంద్రప్రసాద్ పాల్గొని ఈత ఖర్జూర మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిఐ ఇంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈత మొక్కలను పెట్టడమే కాకుండా సంరక్షించాలి అని వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,గౌడ సంఘం అధ్యక్షుడు రాజయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కంతాల కిషన్ రెడ్డి డైరెక్టర్ రాజయ్య, బొడ్డు సునీల్, ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సరిత, హెడ్ కానిస్టేబుల్ జమీల్,నరేష్, కొండల్ రెడ్డి, కానిస్టేబుల్ రజిత, గ్రామ కార్యదర్శి వెంకటేష్, కారోబార్ మాధవరావు,గౌడ సంఘం సభ్యులు బుర్ర లక్ష్మీరాజం,బుర్ర జనార్దన్ గౌడ్ బుర్ర మల్లేశం గౌడ్,బుర్ర అంజయ్య గౌడ్, శ్రీనివాస్  మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post