బ్రేకింగ్ న్యూస్ : భారత్ జవానులు 20 మందికి పైగా అమరులయ్యారు - చైనా 40 మంది మరణం



సరిహద్దుల వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు కొత్తకాదు. కానీ గత రాత్రి జరిగిన ఘర్షణ ఇరుదేశాల సైనికుల్లో ప్రాణనష్టం కలిగించింది. సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు అదనపు బలగాలను ఉపసంహరిస్తున్న తరుణంలో ఈ ఘర్షణ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 ఇక ఈ ఘటనలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందన్న భారత ఆర్మీ... ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది. అయితే ఇప్పుడే అందిన వార్తా ఇరవై మందికి పైగా మన భారత జవానులు వీరమరణం పొందారని , చైనా జవానులు నలభై మందికి పాగా మరణించారని సమాచారం  . అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు  
Previous Post Next Post