పత్రికాధిపతులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.....

మన దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పత్రికాధిపతులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశానికి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా మీడియా పని చేయాలని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post