మహిళా ఎస్సై పట్ల పూజారి అసభ్య ప్రవర్తన - దర్యాప్తు ప్రారంభించిన పోలీసువారు

వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో పూజారి సందీప్‌ శర్మ అలజడి రేపారు.  గుడిలోనే మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివరాత్రి సందర్భంగా మహిళా ఎస్సై గుడికి వచ్చింది. ఆ సమయంలోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఐ స్థానిక  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post