జగన్ చేతకానితనం యావత్తు దేశం తెలిసిపోయింది : చంద్రబాబు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ పై, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టిన ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. బాలకృష్ణ కాన్వాయ్ పై దాడి, విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కాగడాలతో చుట్టముట్టడం.. ఏమిటివన్నీ? వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. జగన్ అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయాయని, ఆయన్ని అందరూ ‘తుగ్లక్’ అంటుంటే ఉక్రోషం పట్టలేకనే ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, అటువంటి తమను దేశద్రోహులు అంటారా అని ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోందంటూ వైసీపీపై మండిపడ్డారు.

https://twitter.com/ncbn/status/1223228895895248896?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1223228895895248896&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-676661-telugu.html

0/Post a Comment/Comments

Previous Post Next Post