బెంగుళూర్ లో మరో మారు బాంబు దాడికి కుట్ర

2019 ఏప్రిల్‌లో తమిళనాడులో హిందూ సంఘానికి చెందిన సురేశ్‌ హత్యకేసులో నిందితుడిగా ఉన్న అనుమానిత ఉగ్రవాది మొయినుద్దీన్‌ ఖాజా బెయిల్‌పై విడుదలై పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇతడితోనూ మహబూబ్‌పాషాకు లింక్‌ ఏర్పడినట్టు సీసీబీ పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే ఖాజా వద్ద కూడా 10కిపైగా సిమ్‌లు ఉన్నట్టు ఇతను పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నాడని సీసీబీ పోలీసులు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఇస్లామిక్‌ స్టేట్‌ పేరిట అమాయక విద్యార్థులకు, యువతకు శిక్షణ ఇచ్చి విధ్వంసకాండకు మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నట్టు మహబూబ్‌పాషాపై అభియాగాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలోని తీర్థహళ్ళిలో ఇద్దరు మాస్టర్‌ మైండ్‌లు ఉన్నారని వీరి సాయంతో విధ్వంసకాండకు స్కెచ్‌ రూపొందించామని పాషా వెల్లడించినట్టు తెలుస్తోంది. యువకులను రిక్రూట్‌ చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వీరిని గాలించే పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబుపేలుళ్ళలోనూ మహబూబ్‌పాషా వద్ద శిక్షణ పొందిన కొందరు పాల్గొన్నట్టు సీసీబీ పోలీసులు గుర్తించారు. దక్షిణభారతదేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసి్‌సను బలోపేతం చేసే టార్గెట్‌ను మహబూబ్‌పాషాకు అప్పగించినట్టు తెలుస్తోంది. జిహాదీ గ్యాంగ్‌ను తయారు చేసుకునే ప్రయత్నాల్లో పాషా ఉన్నట్టు సీసీబీ పోలీసులు అంటున్నారు.
ఇతడి వద్ద రకరకాల నెంబర్లతో పదికిపైగా సిమ్‌కార్డులు లభించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post