పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లి గ్రామానికి చెందిన రైతు కళ్లెం మల్లారెడ్డి 45 సం.. తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక స్థితిలో ఉన్న మల్లారెడ్డి ని రైతులు కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు మృతునికి భార్య సునీత ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post