రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజక వర్గ పరిధిలోని రామాపురం దగ్గర కారును,లారీ డీకొన్న ప్రమాదంలో చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుట్ట పాలెం కస్పా కు చెందిన దంపతులు మృతి చెందడంతో పాటు రాయచోటికి చెందిన ఇద్దరు మృతి చెందగా ఇటు గుట్టపాలెంలోను,అటు రాయచోటిలోను విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల కథనం మేరకు చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుట్టపాలెం కస్పా కు చెందిన సాబ్జాన్ కుమారుడు ఏఇఒ షేక్ హరూన్ భాష సదుం లో ఏఇఓగా పనిచేస్తూ పీలేరు లో నివాసం ఉంటున్నారు. తన మరదలు ఇంట్లో ఫంక్షన్ ఉన్నందున రాయచోటి నుంచి అత్త,మామ,బావమరదులతో కలిసి తన కుటుంబంతో సహా కారులో ప్రొద్దుటూర్ వెళ్లి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో మార్గమధ్యం రామాపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో షేక్ హరుణ్ భాష, అతని భార్య ఆఫ్రి(హసీన) బేగం తో పాటు రాయచోటికి చెందిన హారూన్ అత్త హాజిర బేగం, బావమరిది హర్షద్ ఖాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న హారుణ్ భాష కుమారుడు షేక్ సోహెబ్, కుమార్తె అఫ్రాన్, రాయచోటికి చెందిన అతని బంధువులు షేక్ హనీసా అహ్మద్, జహీర్ అహ్మద్, ముజాహిద్, సుహేల్ మహమ్మద్, ఖాదర్ మొహియుద్దీన్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తో గుట్టపాలెం కస్పాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో చిన్న పిల్లల దిక్కులేని వారు అయిపోయారని వారి ఆలన పాలన ఎవరు చూస్తారని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే భూ కబ్జా బాగోతం – రోడ్డెక్కిన వైసిపి కార్యకర్తలు

0/Post a Comment/Comments

Previous Post Next Post