బట్టబయలైన రేణికుంట టోల్ ప్లాజా నయా దోపిడీ



రాజీవ్ రహదారిపై టోల్ ప్లాజా  నయా మోశానికి తెర లేపింది . కరీంనగర్ జిల్లాలోని రేణిగుంట టోల్ ప్లాజా నిర్వాహకులు ఫాస్ట్ టాగ్  పేరుతొ నయా మోసానికి పాల్పడ్డారు . ఫాస్ట్ టాగ్ పనిచేయడం లేదని వాహనదారుల దగ్గర డబ్బులు వసూల్ చేస్తున్నారు . కొంత దూరం వెళ్ళినతరువాత ఫాస్ట్ టాగ్ లోని డబ్బులు కూడా కట్ కావడం తో టోల్ ప్లాజా సిబ్బందితో  వాహనదారులు వాగ్వాదానికి  దిగారు , తమకి సంబంధం లేదంటూ అక్కడి సిబ్బంది బుకాయించటంతో తమ డబ్బులు తమకి ఇచ్చేయమని డిమాండ్ చేసారు . ప్లాన్ ప్రకారమే టోల్ ప్లాజా నిర్వాహకులు ఈ రకమైన మోసాలకు పాలుపడుతున్నారని  ఆరోపించారు . టోల్ ప్లాజా సిబ్బంది పై ఇకనైనా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు



0/Post a Comment/Comments

Previous Post Next Post