బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు.....నలుగురు మరణం

 


భారత  ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు జరిగాయి. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ క్రమంలో ఘర్షణలను అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు చిట్టగాంగ్‌లోనూ మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసనకారులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్ షెల్స్‌, రబ్బర్‌ బులెట్లు ప్రయోగించినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా ఇద్దరు పాత్రికేయులతో పాటు పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డట్లు సమాచారం.

0/Post a Comment/Comments

Previous Post Next Post