మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురి మృతి, మరో ఇద్దరికి గాయాలు


 

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కారులో ఐదుగురు యువకులు మారేడుమిల్లికి విహారయాత్రకు బయలుదేరారు. మారేడుమిల్లికి సుమారు 5 కి.మీల దూరంలోని హెచ్‌ఎన్‌టీసీ వద్దకు రాగానే యువకులు ప్రయాణిస్తున్న కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే  మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను విజయవాడకు చెందిన పులి ప్రవీణ్‌కుమార్‌(24), పూర్ణసాయి(23), కొత్తగూడెంకు చెందిన లవంగు భరత్‌(24) గా గుర్తించగ గాయపడ్డవారిలో  పాల్వంచకు చెందిన నదీర్‌బాషా(23), కొత్తగూడెంకు చెందిన షేక్‌ ఆసిఫ్‌(24)  ఉన్నారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం  మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు.  మారేడుమిల్లి సీఐ ఏఎస్‌ఎల్‌ రవికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post