గల్వాన్ ఘటనలో అమరుడైన మరో జవాన్



గాల్వాన్ లోయవద్ద భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది అమరులైన సంగతి తెలిసిందే . తాజాగా .. మహారాష్ట్రలోని  మాలెగావ్ తాలూకాలోని సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే వీరమరణం పొందినట్టు సైనిక వర్గాలు తెలిపాయి . నాటి ఘటనలో నదిలో పడిపోయిన ఇద్దరు సైనికులను కాపాడే ప్రయత్నంలో విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయని , ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచినట్టు సమాచారం .
Previous Post Next Post