విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో భారీ శబ్దం - ఆందోళనలో కాలనీవాసులు - పట్టించుకోని అధికారులు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో హనుమాన్ విధిలో మంగళవారం తెల్లవారుజామున ట్రాన్స్ఫారం పేలి భారీ శబ్దం రావడంతో కాలనీవాసులు నిద్రలోనే ఉలిక్కి పడ్డారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ ఫారం లో సమస్య  ఉండడంతో  ఈ ఘటన చోటు చేసుకుంది . పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసినప్పటికి  పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు .  ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Previous Post Next Post