జల దీక్ష కు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన గన్నేరువరం పోలీసు వారు



కరీంనగర్ జిల్లా: పీసీసీ ఆదేశాల మేరకు గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల పైన టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ఆలస్యం నిర్లక్ష్యానికి నిరసనగా ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో నర్మల ఎగువ మానేరు వద్ద టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమానికి వెళ్తుండగా గన్నేరువరం పోలీసు వారు కాంగ్రెస్ జిల్లా నాయకులు చిట్కారి అనంత రెడ్డి, జాగిరి శ్రీనివాస్ గౌడ్, కొమ్మేర రవీందర్ రెడ్డి, గుంటుక రమేష్, రాపోల్ అనిల్, కాల్వ మల్లేశం, ఉపేందర్ రెడ్డి, రాములు, కొరివి శ్రీనివాస్, మల్లికార్జున్, మల్లేశం లను అరెస్టు చేసి గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు తరలించారు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య లో ప్రతిపక్షాల గొంతు నోక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
Previous Post Next Post