చైనా సరిహద్దు ప్రాంతాలకు మిరాజ్-2000 విమానాలను మోహరిస్తున్న భారత్



చైనాతో సుదీర్ఘకాలంగా భారత్ కు సరిహద్దు సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలు యావత్ భారతాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేశాయి. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో భారత వాయుసేన అప్రమత్తమైంది. చైనాతో సరిహద్దుల వద్ద మిరాజ్-2000 యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. పరిస్థితులను సమీక్షించేందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా లేహ్ లో పర్యటించారు. భారత వాయుసేన ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామన్న సంకేతాలను  పంపుతోంది. లడఖ్ ఎయిర్ బేస్ లోనూ భారత యుద్ధ విమానాల కదలికలు ఊపందుకున్నాయి.

Previous Post Next Post