లాక్‌డౌన్ వేళ యథేచ్ఛగా మద్యం విక్రయాలు - రూ.10 లక్షల విలువైన మద్యం సీసాల పట్టివేత



లాక్‌డౌన్ వేళ కూడా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటువంటి వారి ఆటలు కట్టించేందుకు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శీలం శ్రీనివాస్‌రావు నేతృత్వంలో మేడ్చల్ మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్‌లోని బోయిగూడ కమాన్ వద్ద ఓ మద్యం దుకాణం పక్కనే ఉన్న గదుల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post