పారువెల్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో పారువెల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పంచాయతీ ఆఫీసర్ పివి నర్సింహారెడ్డి బుధవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామాన్ని ఆయన సందర్శించారు పలు అభివృద్ధి పనులను గురించి గ్రామస్తులతో చర్చించారు గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్, నర్సరీ, వైకుంఠధామం మరియు మిగితా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు నాయకులతో కలిసి నిద్రించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, కంప్యూటర్ ఆపరేటర్ శివ సాయి గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post