కృష్ణా ఫేజ్‌-3 జలాల తరలింపులో అంతరాయం. : 24 గంటలు మంచినీటి సరఫరాలో అంతరాయం

కృష్ణా ఫేజ్‌-3 జలాల తరలింపులో అంతరాయం. నాగార్జున సాగర్‌ అక్కంపల్లి రిజర్వాయర్‌ నుంచి సాహేబ్‌నగర్‌ వరకు నీటి తరలింపులో భాగంగా 2200, 1500 ఎంఎం డయా పైపులైన్‌కు ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 6న ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల పాటు ఈ మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుందని, ఈ 24 గంటలు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రభావంతో సాహేబ్‌నగర్‌, ఆటోనగర్‌, వైశాలీనగర్‌, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌ దేవరపల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ, బుద్వేల్‌, సులేమాన్‌ నగర్‌, హైదర్‌గూడ, గోల్డెన్‌ హైట్స్‌, గందంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, అసిఫ్‌నగర్‌, రెడ్‌హిల్స్‌, షేక్‌పేట్‌, ప్రశాసన్‌ నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్‌, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్‌, సైనిక్‌పురి, లాలాపేట, స్నేహపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్‌ ప్రాంతాల్లో సోమవారం ఒక్క రోజూ నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post