దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమవుతున్న హైదరాబాద్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు నాలుగో మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. గత మూడు పరాజయాల తర్వాత ఆల్రౌండ్ షోతో అదరగొట్టి కేరళపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా సోమవారం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టారు.
credit: third party image reference
Post a Comment